భారతదేశం, డిసెంబర్ 26 -- ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సోషల్ మీడియాలో జరిగిన ఒక స్కామ్‌కు బలయ్యాడు. తన తల్లి చనిపోయిందని, అంత్యక్రియలకు డబ్బులు లేవని ఒక నెటిజన్ చెప్పిన కట్టుకథను నిజమని నమ్మి, మానవత్వంతో రూ. 20,000 పంపించాడు. తీరా అది స్కామ్ అని నెటిజన్లు బయటపెట్టడంతో.. జీవీ మోసపోయారని తెలిసి ఫ్యాన్స్ అయ్యో పాపం అంటున్నారు.

మంచి మనసుతో సాయం చేయబోయి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఆన్ లైన్ మోసానికి గురయ్యాడు. డిసెంబర్ 25న ఎక్స్ వేదికగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఎక్స్ లో 'ప్రసన్న సదీష్' (Mom Little King) అనే ఒక యూజర్ ఒక మహిళ ఫోటోను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ స్టోరీ రాశాడు. "మా అమ్మ మమ్మల్ని, నా చెల్లిని కష్టపడి పెంచింది. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆమె అంత్యక్రియలు చేయడానికి ...