భారతదేశం, ఏప్రిల్ 20 -- నవగ్రహాలలో అత్యంత శుభప్రదుడు, ప్రేమ, ఐశ్వర్యం మరియు విలాసాలకు కారకుడు అయిన శుక్రుడు తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు. హిందూ పంచాంగం ప్రకారం, ఏప్రిల్ 19, ఆదివారం మధ్యాహ్నం 03:51 గంటలకు శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. వృషభ రాశికి శుక్రుడే అధిపతి కావడం విశేషం. తన స్వక్షేత్రంలోకి అడుగుపెట్టిన శుక్రుడు అక్కడ మే 14వ తేదీ ఉదయం 10:56 గంటల వరకు కొలువుదీరుతాడు.

సొంత రాశిలో శుక్రుడు ఉండటం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన 'మాళవ్య రాజయోగం' ఏర్పడింది. ఈ యోగం వల్ల సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, కళారంగంలో రాణింపు వంటి సానుకూల ఫలితాలు అందుతాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం ఒక 'గోల్డెన్ పీరియడ్' అని చెప్పవచ్చు.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం, శుక్రుడు తన స్వక్షేత్రం (వృషభం, తుల) లేదా ఉచ్చ...