భారతదేశం, జూన్ 5 -- హిందూ సంప్రదాయంలో పరమ ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. ప్రతి మూడేళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం (పురుషోత్తమ మాసం) లో మాత్రమే ఈ ఏకాదశి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే సమస్త పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. వంద యజ్ఞాలు చేసినంత పుణ్యం ఈ ఒక్క వ్రతం వల్లే లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ వ్రత ప్రభావంతో ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. జీవితంలో అన్ని సుఖాలను అనుభవించి, చివరికి మోక్షాన్ని పొందుతారని ప్రతీతి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందడానికి పరమ ఏకాదశి రోజున చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. 2026లో అధిక మాస పరమ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఉపవాస విరమణ ముహూర్తం? ధన లాభం కోసం చేయాల్సిన 3 సులువైన పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ...