భారతదేశం, జనవరి 28 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది.పలు ముఖ్యమైన అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా. పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి ఆమోదముద్ర పడింది.

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా ఐదుగురు చనిపోవడంపై ఏపీ మంత్రి మండలి సంతాపం తెలిపింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి మృతికి సంతాపం తెలుపుతూ క్యాబినెట్ భేటీలో తీర్మానం చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....