మిస్టరీగా స్కూల్ ప్రిన్సిపాల్ మర్డర్.. ఇంటికి వచ్చిన ఆ స్నేహితులు ఎవరు?
భారతదేశం, ఆగస్టు 14 -- తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపా రెడ్డి (48) దారుణంగా హత్యకు గురయ్యారు. బుధవారం రోజున ఆమె నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యంత క్రూరంగా దాడి చేసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
దేవరకొండ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP) ఎమ్.వి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. దాడి తీవ్రత అత్యంత ఘోరంగా ఉంది. రూపా రెడ్డి శరీరంపై సుమారు 27 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇంట్లోని నగదు గానీ, ఇతర విలువైన వస్తువులు గానీ మాయం కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో దొంగతనం కోసం జరిగిన హత్య కాదని, కేవలం కక్షలు లేదా తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.