భారతదేశం, ఫిబ్రవరి 11 -- మహాశివరాత్రి ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటి. మహాశివరాత్రి నాడు భక్తితో శివుని ఆరాధిస్తారు. అలాగే శివాలయాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. శివరాత్రి నాడు శివుడిని పూజించి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. అలాగే శివుడికి ఇష్టమైన పువ్వులను, బిల్వపత్రాలను సమర్పిస్తారు. చాలామంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు.

ప్రతి ఏటా మహాశివరాత్రి మాఘ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 15న వచ్చింది. ఆ రోజు శివపార్వతులను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే శివరాత్రి నాడు అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. శివరాత్రి తర్వాత మీరు ధనవంతులైపోవాలంటే ఖచ్చితంగా శివరాత్రి తర్వాత ఇంటికి వీటిని తీసుకురండి. దీంతో ఒక్కసారిగా మీ జీవితం మారిపోతుంది. సంపదకు లోటు ఉండ...