భారతదేశం, సెప్టెంబర్ 16 -- హిందూ సనాతన ధర్మంలో ప్రతి నెలా వచ్చే పూర్ణిమ తిథికి ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ భాద్రపద మాసంలో వచ్చే పూర్ణిమకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామిని పూజించడంతో పాటు దానధర్మాలు చేస్తుంటారు. ఈ పర్వదినం వెనుక ఉన్న విశేషాలు, పూజా విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారం, భాద్రపద పూర్ణిమ తిథి సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి 11:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి 11:18 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రామాణికంగా సెప్టెంబర్ 26, 2026 నాడే భాద్రపద పూర్ణిమను జరుపుకోనున్నారు. ఈ రోజున చంద్రదర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 26న సాయంత్రం 6:09 గంటలకు చంద్రోదయం కానుంది.

ఈ పవిత్ర రోజున విష్ణుమూర్తి రూపమైన శ్రీసత్యనారాయణ స...