భారతదేశం, మే 27 -- బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్: దుగ్గిరాల కంపెనీని సొంతం చేసుకోవడానికి ఇటు ఇందు, రాజు.. అటు రేఖ గట్టిగానే ప్లాన్స్ చేస్తున్నారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి స్టెప్ లో ఇందు గెలుస్తుంది. పరంధామయ్య మద్దతును కూడగడుతుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మే 27) ఎపిసోడ్ కంపెనీ బోర్డు మెంబర్ పరంధామయ్యతో రాజు, ఇందు మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. ఈ సందర్భంగా దుగ్గిరాల కుటుంబం కంపెనీకి, సమాజానికి చేసిన మంచి గురించి అతడు గొప్పగా చెబుతాడు. రేఖ వచ్చిన తర్వాత దారుణాలు చేస్తోందని, అందుకే తాను కంపెనీకి వెళ్లడం మానేశానని అంటాడు.

మన కంపెనీకి పునర్ వైభవం తెస్తానని ఇందు అంటుంది. అయితే దీనికోసం మద్దతు కావాలని అడగడంతో అతడు సరే అంటాడు. ఐదుగురిలో ఇద్దరు రేఖ మనుషులు ఉన్నారని, మిగిలిన ఇద్దరు మీరు చెప్పినట్లు వింటారని ఇందు చ...