భారతదేశం, మార్చి 2 -- బ్రహ్మముడి సీరియల్ మార్చి 2 ఎపిసోడ్ ఊహకందని మలుపు తిరిగింది. కావ్య, రాజ్ చనిపోయిన తర్వాత వాళ్లు మళ్లీ ఒకప్పుడు పిల్లలుగా ఉన్న నందు, స్వరాజ్ రూపంలో తిరిగి వచ్చారు. గతం మరచిపోయి బస్తీలో పెరిగే స్వరాజ్ రాజుగా.. ఇటు దుగ్గిరాల ఇంట్లో నందు రూపంలో వాళ్లిద్దరూ రావడం విశేషం. దీంతో కథ మరో మలుపు తిరిగింది.

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మార్చి 2) ఎపిసోడ్ గతం మరచిపోయిన స్వరాజ్ ను చూసి అతని కొత్త తల్లిదండ్రులు బాధపడే సీన్ తో మొదలవుతుంది. అతడు ఎవరు? తల్లిదండ్రులు ఎవరు కనిపెట్టడం వాళ్లకు కష్టమవుతుంది. దీంతో భయంతో వణికిపోతున్న స్వరాజ్ ను చూసి వాళ్లు బాధపడతారు.

ఇటు రేఖ ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ ఆనవాళ్లు లేకుండా ఫొటోలను కూడా తగలబెట్టేస్తుంది. అది చూసి అపర్ణ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె వేడుకున్న రేఖ వినదు. ఆమె భర్త, అతని అక్క సంతోషించ...