భారతదేశం, ఫిబ్రవరి 18 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 959వ ఎపిసోడ్ మరో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. రుద్రాణి కుట్రలకు ఇక తెరపడే టైమ్ దగ్గర పడినట్లు అనిపిస్తోంది. అప్పు, కల్యాణ్ లను రాజ్, కావ్య విడిపించడం, ఆమె ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడంతో కథ కీలకమైన మలుపు తిరిగింది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 18) ఎపిసోడ్ రాజ్, కావ్యలను కిడ్నాపర్లు తప్పుదోవ పట్టించే సీన్ తో మొదలవుతుంది. వాళ్లు తప్పుడు అడ్రెస్ కు వెళ్తారు. కానీ వీడియోను బాగా చూసిన రాజ్, కావ్య.. అందులో కిటికీలో నుంచి కనిపించిన ఓ హోర్డింగ్ చూస్తాడు. దానికి ఫోన్ చేసి వాటిని ఎక్కడెక్కడ పెట్టారో తెలుసుకుంటాడు. దాని ద్వారా అప్పు, కల్యాణ్ లను కిడ్నాపర్లు పట్టుకొని ఉంచిన ప్లేస్ ను కనిపెడతాడు.

మరోవైపు నెలలు నిండటంతో అప్పుకి నొప్పులు మొదలవుతాయి. ఆమె విపరీతమైన నొప్పులతో ఏడుస్తూ ...