భారతదేశం, జూన్ 24 -- Brahma Mudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందు తన పవరేంటో రేఖకు చూపిస్తుంది. ఆమెను కూడా రాజు కూడా షాక్ తింటాడు. తన ఆధిపత్యం పోయిందని గమనించిన రేఖ తెరవెనుక దుర్మార్గాలకు తెరలేపుతుంది. దీంతో ఇందు ఆమె ఆగడాలను ఎలా అడ్డుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జూన్ 24) ఎపిసోడ్ ఇందు సీఈవో కావడంతో భూషణ్, భ్రమరాంబ టెన్షన్ పడే సీన్ తో మొదలవుతుంది. ఆమె ఇక తోక జాడిస్తుందని వాళ్లు అంటారు. కానీ రేఖ మాత్రం వాళ్లకు క్లాస్ పీకుతుంది. సీఈవో పదవి మాత్రమే మారింది.. కంపెనీ నా గుప్పిట్లోనే ఉంది.. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని ధైర్యం చెబుతుంది.

ఇటు నందు ఓ బొకే డెలివరీ కోసం వెళ్తుంటే తన బండి పంక్చర్ అవుతుంది. దీంతో ఆమె వెంకీకి ఫోన్ చేస్తుంది. సాయం చేయమని కోరుతుంది. మొదట తనకు అర్జెంట్ డెలివరీ ఉందని...