భారతదేశం, మే 25 -- తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి (CM) విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై కోలీవుడ్ సినీ ప్రముఖులు తమ అభ్యర్థనలు, విజ్ఞప్తుల వర్షం కురిపిస్తున్నారు. దర్శకుడు పాండిరాజ్ రాబోయే మూవీ 'పరిమళ అండ్ కో' ఆడియో లాంచ్ వేడుకలో పాల్గొన్న విజయ్ సేతుపతి.. సినిమా పరిశ్రమ మేలు కోసం సీఎం విజయ్‌కు రెండు కీలక విజ్ఞప్తులు చేశారు. మరోవైపు సినిమాటోగ్రఫీ శాఖ కేటాయింపుపై నటుడు విశాల్ సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

జయరామ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పరిమళ అండ్ కో' చిత్ర ఆడియో లాంచ్ వేడుకకు విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్టేజ్ పైకి రాగానే అభిమానులంతా 'వాతి' (Vaathi - మాస్టర్/గురువు) అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

'మాస్టర్' సినిమాలో విజయ్ సేతుపతికి కో-స్టార్‌గా నటించి, ప్రస్తుతం తమిళనాడు...