భారతదేశం, ఆగస్టు 23 -- శ్రావణ పుత్రదా ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం దీపదానం ఎక్కడ, ఏ సమయంలో చేయాలో ఇక్కడ తెలుసుకోండి. గృహస్థులు, వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం పూజా విధానంపై పూర్తి వివరాలు.

శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. ఈ పవిత్ర రోజున భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించడంతో పాటు దీపదానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఇంటా బయటా సుఖశాంతులు వెల్లివిరియాలని, మనసులోని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ భక్తులు సాయంత్రం వేళ దీపాలు వెలిగిస్తారు. అయితే ఈ విశేషమైన రోజున ఎక్కడ దీపదానం చేస్తే మంచి ఫలితం ఉంటుందనే విషయాలపై స్పష్టత ఉండటం అవసరం.

ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు అనేదానిపై భక్తులలో స్పష్టత కోసం తిథుల వివరాలు పరిశీలిస్తే, ఆగస్టు 23, 24 తేదీలలో ఈ పర్వదినం వస్తోంద...