భారతదేశం, ఆగస్టు 19 -- హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందునా పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి ఆధ్యాత్మికంగా విశేషమైన స్థానం ఉంది. ఈ ఏకాదశి రోజున భోళా శంకరుడితో పాటు జగత్ప్రభువైన శ్రీమహావిష్ణువును ఏకకాలంలో పూజించే అరుదైన భాగం దక్కుతుంది. ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి వేడుకలకు రంగం సిద్ధమైంది. భక్తులు ఈ పవిత్ర దినం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న ప్రారంభమై, ఆగస్టు 24న తెల్లవారుజామున 4 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం ఆగస్టు 23వ తేదీనే ఏకాదశి వ్రతం ఆచరించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పవిత్ర రోజున సిద్ధ యోగం, పూర్వాషాఢ నక్షత్రం యొక్క అద్భుతమైన కలయిక కుదురుతోంది. ఈ శుభ సంయోగం వల్ల పూజా ఫలం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. శ్రీహరికి ఏకాదశి తిథి అంటే అత్యంత ప్రీత...