భారతదేశం, మార్చి 23 -- కొన్నేళ్లుగా క్రికెట్ మైదానంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న పోరు మామూలుగా ఉండట్లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఆటగాళ్ల మధ్య గట్టిగానే ఆవేశాలు, మాటల యుద్ధాలు కనిపిస్తున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత ఆఫ్ఘన్ ఆటగాళ్ల ముఖాల్లో కనిపించిన ఆనందాన్ని అభిమానులు ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. కానీ ఆ భారీ సక్సెస్ చూడటానికి ముందు వాళ్లు చాలాసార్లు తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారు. అందులో వాళ్లను బాగా కుంగదీసిన సంఘటన మాత్రం 2022 ఆసియా కప్‌లో జరిగింది. షార్జా గ్రౌండ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లోకి వచ్చిన విజయాన్ని పాకిస్థాన్ చివర్లో లాగేసుకుంది.

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ ఆ మ్యాచ్‌లో తమ జట్టు ఎలా ఓడిపోయిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. ఆఖరి ఓవర్‌ల...