భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలి. డేటా మేనేజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మైక్రోబయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును భట్టి అర్హతలు ఉంటాయి.

జీతం విషయానికి వస్తే.. డేటా మేనేజర్లు పోస్టుకు రూ.36,225, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.18,450, మైక్రోబయాలజిస్ట్ పోస్టుకు రూ.45,282, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.23,393, ల్యాబ్ అసిస్టెంట్ రూ.15,000 వేతనం చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్‌ కింద చిత్తూరు జిల్లాలో జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుండి కా...