భారతదేశం, మే 25 -- హిందూ సంప్రదాయంలో పూజ అనేది కేవలం ఒక మొక్కుబడి వ్యవహారం కాదు. అది దైవంతో అనుసంధానమయ్యే ఒక పవిత్ర ప్రక్రియ. భక్తి, శ్రద్ధ, ఆత్మసమర్పణతో చేసే పూజ మాత్రమే పూర్తి ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది దేవుడి గదిలోకి వెళ్లి నిలబడే దండం పెట్టుకుని, హడావుడిగా బయటకు వచ్చేస్తుంటారు. శాస్త్రాల ప్రకారం ఇలా నిలబడి పూజ చేయడం సరైంది కాదు. పూజ ఎప్పుడూ ప్రశాంతంగా, ఒక ఆసనం మీద కూర్చుని మాత్రమే చేయాలి. అసలు నిలబడి పూజ చేయడం వల్ల కలిగే నష్టాలేంటి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.

శాస్త్రాల ప్రకారం నిలబడి పూజ చేయడం వల్ల మనసు స్థిరంగా ఉండదు. మనం నిలబడినప్పుడు మన శరీరంలోని ఆలోచనలు, ఏకాగ్రత చెదిరిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల భక్తిలో సంపూర్ణత లోపిస్తుంది. "నిలబడి చేసే పూజ వ...