భారతదేశం, ఆగస్టు 12 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ముగించింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 746 పాయింట్లు పెరిగి 80,604 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 221 పాయింట్లు వృద్ధిచెంది 24,585 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 506 పాయింట్లు పెరిగి 55,510 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,202.65 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,972.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఆగస్ట్​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 15,221.52 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 42,767.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ ...