భారతదేశం, మార్చి 4 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 4 ఎపిసోడ్ లో.. శాలిని నిజంగా క్రూరమైందే అయితే ఇప్పటికే ఈ ఇంట్లో వాళ్ల ప్రాణాలు తీసేది. ఎందుకు ఇన్ని మాటలు పడుతుంది? శాలిని, క్రాంతిని కలపాలని విరాట్ తో చంద్రకళ అంటుంది. అందరి గురించి ఆలోచిస్తావ్ కానీ నా గురించి మాత్రం పట్టించుకోవని విరాట్ అంటాడు.

నేనేమో దసరా బుల్లోడిలా రెడీ అయ్యా. నువ్వు నన్ను అబ్జర్వ్ చేశావా? అని చంద్రకళను విరాట్ అడుగుతాడు. లుంగీ కట్టావేంటీ? అని చంద్ర అడుగుతుంది. మూడ్ కు తగ్గట్లు క్యాస్టూమ్స్ ఉంటాయి. పద్ధతిగా మూడు రాత్రులు జరగాల్సిందేనని లైట్ ఆఫ్ చేసిన విరాట్.. చంద్రకళను దగ్గరకు తీసుకుంటాడు. వీళ్లు రొమాన్స్ లో మునిగిపోతారు.

శాలిని పట్ల క్రాంతి తీరుపై రఘురాం, జగదీశ్వరి ఆలోచిస్తూ కూర్చుంటారు. ఒక కొడుకు కాపురం నిలబడిందని సంతోషించేలోపు ఒక కొడుకు కాపురం కూలిపోయిందని జగదీ...