భారతదేశం, మార్చి 3 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 3 ఎపిసోడ్ లో.. కూలీగా పని చేస్తూ రఘురాం ఫ్యామిలీ ముందు రాజ్ డ్రామా ప్లే చేస్తాడు. శ్రుతిని ప్రేమగా చూసుకోవాలంటే సంపాదన పెరగాలి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే డబ్బులు లేవు. నేను ఇలా కూలీ పనికి వచ్చానని శ్రుతికి చెప్పొద్దని రాజ్ వెళ్లిపోతాడు.

నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇందులో ఏదో మోసం ఉందని రాజ్ గురించి కామాక్షి అంటుంది. జల్ రాజ్ లో మార్పు వచ్చింది. కష్టం విలువ తెలిసొచ్చిందని చంద్రకళ చెప్తుంది. అవును పిన్ని ఎన్ని ఎత్తులు వేసినా మన దగ్గర నుంచి డబ్బులు రావని తెలిసిపోయినట్లుంది. ఇంకా కష్టపడక తప్పదని తెలుసుకున్నాడని శాలిని అంటుంది. ఇప్పుడు అతణ్ని నమ్మొద్దని రఘురాంతో కామాక్షి చెప్తుంది.

కామాక్షి, రఘురాం కాసేపు వాగ్వాదం చేసుకుంటారు. ఆ సమయంలోనే ఓ సిమెంట్ వ్యాన్ కంట్రోల్ తప్పి రఘురాం వైప...