భారతదేశం, మార్చి 23 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 23 ఎపిసోడ్ లో.. బావకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? ల్యాండ్ వివాదంలో ఇప్పటికే బావపై ఎటాక్ కూడా జరిగింది. దీని వెనుక ఎవరెవరు ఇన్వాల్స్ అయ్యారో తెలియదు. వెంటనే వచ్చేయమను క్రాంతి అని శాలిని అంటుంది.

ఇప్పుడు అన్నయ్య ల్యాండ్ వదులుకోవాలన్నది నీ ప్లాన్ కదా అని క్రాంతి అంటాడు. సమస్య గురించి మరీ ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడొద్దు. బావ నాతో ఎప్పటికప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. సమస్య నుంచి దూరంగా పారిపోతే ఎలా అని చెప్పాడని చంద్రకళ అంటుంది. విరాట్ లో ధైర్యం, తెగింపు ఉన్నాయి కాబట్టే బిజినెస్ ను అంత బాగా డెవలప్ చేయగలిగాడని జగదీశ్వరి అంటుంది.

విరాట్ తన గురించి ఆలోచించడం లేదని మాయ ఫీల్ అవుతుంది. తల్లి సునందకు శాలిని కాల్ చేస్తుంది. పురుషోత్తం గురించి సెర్చ్ చేస్తున్నాడు పిచ్చి బావ. పురుషోత్తం దొరకడు కదా...