భారతదేశం, సెప్టెంబర్ 3 -- మద్యం మత్తు, క్షణికావేశం కాపురాల్లో నిప్పులు పోయడమే కాదు.. కన్నబంధాలను సైతం ఎంత దారుణంగా బలితీసుకుంటాయో నిరూపించే హృదయవిదారక ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. తనను చూసి నవ్వాడనే కారణంతో కన్నతండ్రి అని కూడా చూడకుండా గొంతు కోసి దారుణంగా హత్య చేశాడో కిరాతక కొడుకు. పెనుమూరు మండలంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘోరం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మాణిక్యరాయునిపల్లె గ్రామానికి చెందిన చెంగారెడ్డి (55)కి జోకేష్ రెడ్డి, హేమచంద్ర రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన జోకేష్ రెడ్డి ఎల్లంపల్లె సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య చూడమణి పెనుమూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తోంది. వీరిద్దరూ పెనుమూరులోనే నివాసముంటున్నారు.

అయితే ...