భారతదేశం, జూలై 20 -- జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత మర్మమైన, అంతుచిక్కని గ్రహంగా భావించే రాహువు కదలికల్లో త్వరలోనే కీలక మార్పు చోటుచేసుకోనుంది. ప్రస్తుతం శని దేవుడి స్వక్షేత్రమైన కుంభరాశిలో, తన సొంత నక్షత్రంలో కొలువై ఉన్న రాహువు.. మరికొద్ది రోజుల్లో అంగారకుడి (కుజుడు) నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.

హిందూ పంచాంగం ప్రకారం... ఆగస్టు 2, 2026న రాహువు 'ధనిష్ట' నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం డిసెంబర్ 5, 2026 వరకు కుంభరాశిలోనే రాహువు సంచారం కొనసాగుతుంది. ఈ నక్షత్ర, రాశి మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి బంపర్ లాభాలు కలగనున్నాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు.

కుంభరాశిలో రాహువు సంచారం మరియు ధనిష్ట నక్షత్ర ప్రవేశం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు, అఖండ విజయాలు లభించనున్నాయి. ఆ రాశుల వివరాలు ఇలా...