భారతదేశం, సెప్టెంబర్ 15 -- తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన దీపావళికి ఇంకా సుమారు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ పండుగ సీజన్‌కు ముందే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల సంచారంలో వస్తున్న కీలక మార్పులు కొద్దిమందికి అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం కాసుల వర్షం కురిపించనుంది. నిలిచిపోయిన పాత బాకీలు వసూలు కావడం, కొత్త వ్యాపార అవకాశాలు తలుపు తట్టడం వంటి సానుకూల పరిణామాలు ఈ నాలుగు రాశులవారి జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురానున్నాయి.

మేష రాశి వారికి దీపావళికి ముందు కాలం వ్యాపార పరంగా స్వర్ణయుగమని చెప్పవచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కొత్త వ్యక్తుల పరిచయం లాభసాటిగా మారుతుంది. శుక్రుడి సంచార ప్రభావంతో మీ వ్యాపార సంబంధాలు బలపడతాయి. పాత క్లయింట్ల నుంచి మళ్లీ ఆర్డర్లు వచ్...