భారతదేశం, జూలై 23 -- హిందూ సాంప్రదాయంలో ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది. దీనినే దేవశాయని ఏకాదశి, తొలి ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది జూలై 25వ తేదీన భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ రోజు నుంచి జగత్పాలలకుడైన శ్రీమహా విష్ణువు శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తారు.

దీనితో పాటు నాలుగు నెలల పాటు సాగే చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో శుభకార్యాలు నిలిచిపోయినా, భగవద్భక్తికి, దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, కెరీర్ పరమైన అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవేంటో పరిశీలిద్దాం.

ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎదుగుదల లేక సతమతమవుతున్న వారు ఈ ఏకాదశి రోజు శ్రీహరి విష్ణువును కుంకుమ...