భారతదేశం, మే 21 -- ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి పవిత్ర ఘాట్ వద్ద వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ పుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, కొండా సురేఖ పాల్గొని నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తొలిసారిగా ఈ అంత్య పుష్కరాలను ఇంత భారీ ఎత్తున అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.

ఘాట్ల పరిసరాల్లో ఎండ దెబ్బ తగలకుండా భారీ టెంట్లు, న...