భారతదేశం, డిసెంబర్ 25 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. అనూహ్య ర‌ద్దీ కార‌ణంగా డిసెంబ‌ర్ 27, 28, 29వ‌ తేదిల‌కు (శ‌ని, ఆది, సోమ‌వారం) సంబంధించి శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని టీటీడీ ర‌ద్దు చేసింది.

ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కౌంట‌ర్ లో, తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యంలో శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్లు జారీ చేయ‌బ‌డ‌వు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించికోవాల‌ని ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....