భారతదేశం, మే 21 -- Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుపతి నగర నడిబొడ్డున వెలసిన చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. శిల్పకళ, భక్తి, ఆగమ సంప్రదాయాల సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాల సంబరం మొదలుకానుంది. మే 23 నుండి 31వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు మే 22న శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 22వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య ఈ అంకురార్పణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది.

బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజున నిర్వహించే అంకురార్పణకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మే 22న ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మే...