భారతదేశం, జూలై 3 -- మహారాష్ట్రలోని పుణెలో కొరియర్ డెలివరీ బాయ్ నని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత, అతడు ఆ యువతితో సెల్ఫీ దిగి, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.
పుణెలోని కొంధ్వా ప్రాంతంలో ఉన్న హౌసింగ్ సొసైటీలో రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కొరియర్ వచ్చిందని, దాన్ని డెలివరీ చేయడానకిి వచ్చానని చెప్పి మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి తలుపు తట్టాడు. ఆ సమయంలో ఆమె సోదరుడు పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో ఆ యువతి ఒంటరిగా ఉండడంతో ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం, బాధితురాలితో సెల్ఫీ తీసుకొని, నేరం గురించి ఎవరికీ చెప్పొద్దని, ఎవరికైనా చెబితే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.