భారతదేశం, ఆగస్టు 13 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని సూచీలు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 368 పాయింట్లు పడి 80,240 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 98 పాయింట్లు కోల్పోయి 24,487 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 467 పాయింట్లు పడి 55,044 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,375.70 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,525.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఆగస్ట్​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 18,597.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 46,293.67 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంలో ఉండటం ...