భారతదేశం, సెప్టెంబర్ 19 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 320 పాయింట్లు పెరిగి 83,014 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 93 పాయింట్లు వృద్ధిచెంది 25,424 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 234 పాయింట్లు పెరిగి 55,727 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 411.70 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,344.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 25,300- 25,150 లెవల్స్​ వద్ద కీలక సపోర్ట్​ ఉంది. 25,500 లెవల్​ దగ్గర రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే సూచీ 26,000 ...