భారతదేశం, జూలై 7 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 193 పాయింట్లు పెరిగి 83,433 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 56 పాయింట్లు వృద్ధిచెంది 25,461 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 240 పాయింట్లు పెరిగి 57,032 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 760.11 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 1,028.84 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఈ జులై​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 5773.06 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4111.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాప...