భారతదేశం, ఆగస్టు 11 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత్​పై విధించిన టారీఫ్​ కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని సూచీలు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 765 పాయింట్లు పడి 79,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 233 పాయింట్లు కోల్పోయి 24,363 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 516 పాయింట్లు పడి 55,005 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,932.81 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,723.66 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

ఈ ఆగస్ట్​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 14,018.87 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 36,795.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక ద...