భారతదేశం, జూలై 8 -- తమిళనాడులో మంగళవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుద్దలూరులో ట్రాక్ దాటుతుండగా ఒక స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి.
మంగళవారం ఉదయం 7 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కుద్దలూరు- అలప్పక్కమ్ మధ్యలో ఉన్న రైల్వే క్రాసింగ్ని స్కూల్ బస్సు దాటుతుండగా వేగంగా రైలు వచ్చి ఢీకొట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి పరుగులు తీశారు. బస్సులోని ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.
తాజా ఘటన నేపథ్యంలో రైల్వే క్రాసింగ్ల వద్ద భద్రత మరోమారు చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రమాదం కారణంగా స్కూల్ బస్సు ముందు భాగంగా భారీగా దెబ్బతింది! ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తమిళనాడు స్కూల్ బస్సు ప్రమాదంపై మరిన్ని వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.