భారతదేశం, ఫిబ్రవరి 15 -- బ్లాక్ బస్టర్ పోరుకు రంగం సిద్ధమైంది. హై వోల్టేజీ సమరానికి టైమ్ ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఈ రోజే. ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో అందరూ అనుకున్నట్లుగానే ఆటగాళ్ల మధ్య షేక్ హ్యాండ్ లేదు. పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేసేందుకు ఇండియన్ ప్లేయర్లు నిరాకరించారు. టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీన్ని బట్టి మరోసారి ఇండియా, బీసీసీఐ తన వైఖరిని బలంగా చాటింది.

నిజానికి టీ20 ప్రపంచకప్ లో ఇండియా వ...