భారతదేశం, ఫిబ్రవరి 6 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఇన్‌ఛార్జ్‌ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.

టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రవిచంద్ర మీడియాతో మాట్లాడారు.భక్తులకు సేవచేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి భక్తుడిగా ఎంతో మందికి సేవచేసే భాగ్యం దక్కిందన్నారు.ప్రభుత్వం, భక్తుల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో ముందుకు సాగుతానని చెప్పారు.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో భాగంగా ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యద...