భారతదేశం, మార్చి 31 -- తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నస్వామి ఆలయం హనుమాన్ చిన్న జయంతి వేడుకలకు సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు హనుమాన్ చిన్న జయంతి వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుండి సుమారు మూడు లక్షల మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.

హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు తమ దీక్షను ముగించుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. వారిలో కొందరు అప్పటికే ఆలయానికి చేరుకోగా, చాలామంది వివిధ ప్రాంతాల నుండి కాలినడన బయలుదేరారు. ఆలయం వద్ద భారీ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నందున.. ఆలయ అధికారులు మూడు రోజుల పాటు అన్ని 'అర్జిత సేవలను' రద్దు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం 50,00...