భారతదేశం, జూన్ 28 -- భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల నడక, వాటి స్థాన చలనాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా నవగ్రహాలలో న్యాయధికారిగా, కర్మఫల ప్రదాతగా పిలవబడే శని దేవుడి కదలికలలో వచ్చే మార్పులు మానవ జీవితాలపై అత్యంత బలమైన ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాలన్నింటిలోకి మందగమనుడైన శని భగవానుడు త్వరలోనే తన నడకను మార్చుకుని తిరోగమనం (వక్రీ చెందడం) కాబోతున్నాడు.

శని దేవుడి ఈ వక్ర గమనం మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో భిన్నమైన, విలక్షణమైన మార్పులను తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ కాలం కొందరికి ఊహించని పురోగతిని, ఆర్థిక లాభాలను తెచ్చిపెడితే.. మరికొందరికి సహనానికి, కఠిన శ్రమకు పరీక్షా సమయంగా మారనుంది.

వైదిక పంచాంగ గణాంకాల ప్రకారం.. శని దేవుడు 2026 జూలై 27వ తేదీన మీనరాశిలో తిరోగమనం చెందబోతున్నాడు. అంటే వెనక్కి నడుస్తున్నట్లు కనిపిస...