భారతదేశం, జూలై 14 -- విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నెల రోజుల పాటు జరిగే ఆషాఢ సారె సమర్పణ మహోత్సవాలకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. 2026 జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కనకదుర్గ గుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) వి.కె. సీనా నాయక్ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీ కనకదుర్గ నగర్ వద్ద క్లోక్ రూమ్, ఉచిత పాదరక్షల స్టాండ్, మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

అమ్మవారికి సాంప్రదాయ ఆషాఢ సారెను సమర్పించే భక్తుల కోసం ఆలయ యంత్రాంగం ఈసారి ఒక క్రమబద్ధమైన వ...