భారతదేశం, జూలై 1 -- దేశంలో బంగారం ధరలు జులై 1, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 97,583గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,758గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 89,463కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,946గా ఉంది.

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం భారీగా పెరిగి, రూ. 1లక్ష మార్క్​ తాకిన 24 క్యారెట్ల బంగారం ధర, ఇప్పుడు రూ. 98వేల మార్క్​ దిగువకు చేరుకున్నాయి.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,315 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,435గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,311గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,431గా ఉంది...