భారతదేశం, జూలై 16 -- పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి రథయాత్ర అంటేనే భక్తులకు కన్నుల పండుగ. ఆ దేవదేవుడు గర్భాలయం దాటి, వీధుల్లోకి వచ్చి భక్తులకు సాక్షాత్కరించడం వెనుక వేల ఏళ్ల నాటి చరిత్ర, అద్భుతమైన పురాణ గాథలు ఉన్నాయి. అసలు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిల విగ్రహాలు ఎలా తయారయ్యాయి? శతాబ్దాల క్రితం రాజు ఇంద్రద్యుమ్నుడికి స్వయంగా శ్రీహరి కలలో కనిపించి ఏం చెప్పారు? ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం, రాజు ఇంద్రద్యుమ్నుడు శ్రీమహావిష్ణువుకు పరమ భక్తుడు. తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా స్వామిని కళ్లారా చూడాలని, ఆ పరమాత్ముడు తన రాజ్యంలోనే కొలువై ఉండాలని ఆయన తీవ్రంగా పరితపించేవారు. భక్తుడి భక్తికి మెచ్చిన జగన్నాథుడు, ఆయనకు సాక్షాత్కారం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఓ రాత్రి, తన ఆరాధ్య దైవం కోసం చింతిస్తూ నిద్రపోయిన రాజుకు, స్వయంగా శ్ర...