భారతదేశం, మార్చి 17 -- విశ్వావసునామ సంవత్సరానికి స్వస్తి పలికి, పరాభవనమ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ ఏడాది ఉగాది పండుగ వచ్చిన విషయం తెలిసిందే. హిందువులు జరుపుకునే ముఖ్య పండుగల్లో చైత్ర నవరాత్రులు ఒకటి. తొమ్మిది రోజులు పాటు భక్తులు దుర్గాదేవి తొమ్మిది అవతారాలను ఆరాధిస్తారు. అలాగే ఉపవాసాలు ఉంటారు. ఇలా చేయడం వలన కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు. మార్చి 19 నుంచి మార్చి 27 వరకు చైత్ర నవరాత్రులు. మార్చి 19 నుంచి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది.

చైత్ర శుక్ల పాడ్యమి ఉదయం 6:52కి ప్రారంభమవుతుంది, మార్చి 20 ఉదయం 4:52తో ముగుస్తుంది. మార్చి 19న కలశ స్థాపన చేసి నవరాత్రుల పూజలు మొదలుపెట్టాలి. ఉగాది నాడు తలస్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేసుకోవాలి. అలాగే పూజ అయిన తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించా...