భారతదేశం, మార్చి 27 -- భువనగిరిలో ఘోరమైన ఘటన జరిగింది. వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరిలోని తారకరామ్‌నగర్‌లో ప్రియాన్ష్ అనే నాలుగేళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు అతడిపై దాడిచేశాయి.

భువనగిరిలో తారకరామ్‌నగర్‌కు చెందిన సందెల రాహుల్‌కుమార్, శ్రావణి దంపతుల కుమారుడు ప్రియాన్ష్ ఇంటి బయట ఆడుకుంటున్నాడు. రెండు కుక్కలు అతడి మీద దాడి చేశాయి. ఒక కుక్క ముఖంపై తీవ్రంగా కరిచి బాలుడి కనుగుడ్డును పీకేసింది. బాలుడు కేకలు వేయగా.. కుటుంబ సభ్యులు, కాలనీవాసులు బయటకు వచ్చి చూశారు. అప్పటికే బాలుడి కనుగుడ్డు నేలపై పడింది. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొన్నది. వెంటనే కుక్కను తరిమికొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైవ వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు.

మరోవైపు ఆర్‌బ...