భారతదేశం, ఆగస్టు 8 -- మనిషి జీవితాన్ని ప్రభావితం చేయడంలో నవగ్రహాల పాత్ర చాలా కీలకం. జాతకంలో గ్రహాల స్థితి బాగుంటే ఎలాంటి ప్రయత్నంలోనైనా విజయాలు సాధించవచ్చు. అదే సమయంలో గ్రహాల సంచారం అనుకూలించకపోతే కెరీర్, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదురుకావడం సర్వసాధారణం. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా, కేవలం నీటితో చేసే కొన్ని సులభమైన పరిహారాల ద్వారా ఈ గ్రహ దోషాల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

జాతకంలో సూర్య భగవానుడి అనుగ్రహం లేకపోతే ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు. దీని కోసం ప్రతిరోజూ ఉదయమే రాగి పాత్రలోని నీటిలో ఎర్రచందనం, ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.

ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మానసిక ప్రశాంతత లోపించినప్పుడు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతే చంద్ర దోషం ఉన్నట్లు భావి...