భారతదేశం, జూలై 26 -- ఆషాఢ పౌర్ణిమ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన దినం. ఈ రోజు మనం జరుపుకునేది కేవలం ఒక పండుగ కాదు; మన జీవితానికి వెలుగునిచ్చిన గురుతత్త్వాన్ని స్మరించుకునే ఆధ్యాత్మిక మహోత్సవం. అందుకే ఈ పవిత్ర దినాన్ని గురుపౌర్ణిమ లేదా వ్యాసపౌర్ణిమ అని పిలుస్తారు.

నేటి కాలంలో గురువు అనే పదానికి అనేక అపార్థాలు ఏర్పడ్డాయి. ఎవరు రెండు మాటలు చెప్పినా, ఎవరు ఆశ్రమం స్థాపించినా, ఎవరు వేలాది మంది అనుచరులను కూడగట్టినా వారందరినీ గురువులుగా భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ సనాతన ధర్మం అటువంటి ప్రమాణాన్ని ఎక్కడా అంగీకరించలేదు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.

"తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్"

- ముండకోపనిషత్ (1.2.12)

ఈ ఒక్క మంత్రం గురుత్వానికి శాశ్వత ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది.

శ్ర...