భారతదేశం, మే 25 -- గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా కలిసి రోహిణి మలేషియా డ్రామా గుట్టు రట్టు చేయడానికి సిద్ధమవుతున్నారు. ట్రిప్‌లో బాలుకి అనుకోకుండా కలిసి మలేషియా దంపతులు.. వాళ్ల ఇంటికి అతిథులుగా రాబోతున్నారు. దీంతో ఓవైపు పోయిన డబ్బు కోసం వెతుకుతున్న రోహిణికి.. మరో పెద్ద గండం ముంచుకొస్తోంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మే 25) ఎపిసోడ్ బాలుకి మలేషియా దంపతులు ట్రిప్ లో కలిసే సీన్ తో మొదలవుతుంది. తనది పాలకొల్లు అయినా మలేషియాలో సెటిలయ్యానని, చాలా ఏళ్ల తర్వాత రాజమండ్రి వచ్చినట్లు ఆ వ్యక్తి చెబుతాడు. తన భార్యను పరిచయం చేస్తాడు.

బాలు కూడా రాజమండ్రి గురించి, ఇన్నేళ్లలో ఇక్కడ మారిన పరిస్థితుల గురించి చెప్పి పరిచయం పెంచుకుంటాడు. ఈరోజు తమ 25వ పెళ్లి రోజు అని వాళ్లు చెప్పి గుడికి తీసుకెళ్లమని అడుగుతారు. సరే అంటూ ముందుగానే ...