భారతదేశం, సెప్టెంబర్ 13 -- హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్మరించుకునే దైవం విఘ్నేశ్వరుడు. సకల విఘ్నాలను తొలగించే ప్రథమ పూజ్యుడిగా గణనాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. భాద్రపద శుద్ధ చవితి రోజున ప్రారంభమయ్యే ఈ మహోత్సవం దేశవ్యాప్తంగా అంబరం తాకేలా సాగుతుంది. పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకునే బప్పా, అనంత చతుర్దశి రోజున కరిగిపోయే నీటిలో నిమజ్జనమవుతూ భక్తులకు వీడ్కోలు పలుకుతారు.

శివపార్వతుల కుమారులైన సుబ్రహ్మణ్య స్వామి, గణేశుల మధ్య శ్రేష్టతపై ఒకసారి పోటీ ఏర్పడింది. ప్రపంచాన్ని చుట్టివచ్చిన వారే గొప్ప అని తేల్చాలని శివుడు షరతు పెడతాడు. కార్తికేయుడు తన నెమలి వాహనంపై లోక సంచారానికి బయలుదేరగా, మూషిక వాహనుడైన గణేశుడు మాత్రం తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు.

"తల్లిదండ్రులే నాకిల సమస్త లోకాలు" అని ...