భారతదేశం, జూన్ 17 -- వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. వినాయకుడిని పూజించడం వలన మనం చేసే ఏ కార్యమైనా కూడా విజయవంతంగా పూర్తి అవుతుందని నమ్మకం. అందుకే ఎలాంటి శుభకార్యాలు చేసినా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తాము. పెళ్లిళ్లు జరిపేటప్పుడు కూడా వినాయకుడి పూజ చేసి పెళ్లి పనులు మొదలు పెడతాము.

వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, సంపద, శాంతి లభిస్తాయి. ఐశ్వర్యం, విద్యాబుద్ధి కూడా పెరుగుతాయి. కుటుంబంలో ఆనందం, ఐక్యత కూడా వినాయకుని ఆరాధించడం వలన పెరుగుతాయి. రోజూ వినాయకుడిని ఆరాధించడం వలన భక్తి, ధైర్యం, విజయాలను పొందడానికి వీలవుతుంది.

వినాయకుడిని ఆరాధించేటప్పుడు ఈ 16 నామాలను జపించండి. ఈ 16 నామాలను చదువుకోవడం వలన వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం ద్వారా వినాయకు...