భారతదేశం, మే 25 -- హిందూ ధర్మంలో గంగానది కేవలం ఒక నది మాత్రమే కాదు.. అది కోట్లాది మంది విశ్వాసం, మోక్షానికి మార్గం. జ్యేష్ఠ శుక్ల పక్ష దశమి తిథి నాడు గంగా దసరా పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున గంగా మాత భూమిపైకి అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హస్త నక్షత్రంలో గంగమ్మ భూమిని తాకినట్లు ప్రతీతి. ఈ పర్వదినం వేళ నదిలో పుణ్యస్నానం ఆచరిస్తే పది రకాల పాపాలు తొలగిపోయి, అక్షయ పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

అయితే, 2026 సంవత్సరంలో గంగా దసరా ఏ రోజున జరుపుకోవాలనే విషయంలో సామాన్యుల్లో కొంత అయోమయం నెలకొంది. కొన్ని పంచాంగాల ప్రకారం మే 25 అని, మరికొన్నింటిలో మే 26 అని ఉండటమే ఇందుకు కారణం.

వారణాసి పంచాంగ గణాంకాల ప్రకారం, గంగా దసరా పండుగను 2026 మే 26, మంగళవారం నాడు జరుపుకోవడం ఉత్తమమని ప్రముఖ జ్యోతిష్య పండితులు...