భారతదేశం, మార్చి 10 -- ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌తో కలిసి కవిత సోమవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే వీరి దీక్షను ఇవాళ పోలీసులు భగ్నం చేయగా. ఇద్దర్ని అరెస్ట్ చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవితను హైదరాబాద్ కు తరలించారు.

సోమవారం వెలుగుమట్ల బాధితులను కలిసిన కవిత. వారికి సంఘీభావం తెలిపారు. పేదల ఇళ్లను కూల్చటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ చేసిందని విమర్శించారు. ఇళ్లు కూల్చి పేదలను రోడ్డున పడేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. కూల్చిన చోటే బాధితులకు కొత్త ఇళ్లు కట్టివ్వాలి న్యాయం జరిగే వరకు బాధితులతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

"జాగృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ సంయుక్తంగా వెలుగుమట్ల బాధితులకు మ...